Wednesday, January 18, 2017

సంప్రదాయ నృత్యాలు

సంప్రదాయ నృత్యాలు


కూచిపూడి :

కూచిపూడి ఆంద్రప్రదేశ్ లో బాగా ప్రచారంలో ఉన్న నాట్యం.కూచిపూడి ఆంధ్రప్రదేశ్ లోని కుచేలపురం అనే గ్రామంలో అవతరించింది.సాధారణంగా దీనిని ఒక్కరే అభినయిస్తారు.తీర్థ నారాయణ,సిద్దేంద్రయోగి అనేవారు ఈ శైలిని రూపొందించారు.

కథక్ :

ఈ నాట్యం ఉత్తర భారతదేశంలో బాగా బాగా ప్రసిద్ధి చెందింది.కథక్ అనే పదం కథ అనే పదం నుండి ఉద్భవించింది.దీనిని స్త్రీ,పురుషులిరువురు ప్రదర్శిస్తారు.

మణిపురి :

ఇది ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా మణిపూర్ లో బాగా ప్రాచుర్యంలో ఉన్న నాట్యం.ఈ నాట్యంలో రాధా-కృష్ణుడు గోపికల కధాంశాలను ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతుంది.

భరతనాట్యం :

దృశ్య కళల్లోభరతనాట్యానికి ప్రముఖ స్థానం ఉంది.ఇది దక్షిణ భారతదేశం లోని దేవాలయాలలో ఆవిర్భవించింది.భరతనాట్యం తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది.

ఒడిస్సీ :

ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నాట్య రూపం.జైన రాజు ఖారవేలుడు పాలించిన క్రీ.పూ రెండవ శతాబ్దంలో ఈ నాట్య రూపం అభివృద్ధి చెందింది.

కథాకళి :

ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్య రూపం.ఇది కేరళ లోని రాజాస్థానాలలో అవతరించింది.

మోహినీ అట్టం :

ఇది కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది.దీనిని ఒక వ్యక్తీ మాత్రమే అభినయిస్తాడు.

నృత్యము                        ప్రాంతం

1.కూచిపూడి                    ఆంధ్రప్రదేశ్

2.కథక్                             ఉత్తర భారతదేశం

3.మణిపురి                     మణిపూర్

4.భరతనాట్యం              తమిళనాడు

5.ఒడిస్సీ                      ఒడిశా

6.కథాకళి, మోహినీ అట్టం     కేరళ

No comments:

Post a Comment